డిజిటల్ క్యాంపెయిన్ లో అనంతసాగరం జనసేన

అనంతసాగరం, గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాం16 తేదీన అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు నుంచి పడమటి ఖమ్మంపాడు ఇసుక రీచ్ దగ్గర వరకు రోడ్లు చాలా అధ్వాన దుస్థితి ఉన్నాయని గాఢ నిద్ర ఉన్న రాష్ట్ర సీఎం జగన్ రెడ్డికి నిద్ర లేపుతూ #GoodMorningCMSir హాష్ టాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ నిర్వహిస్తూ మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మాట్లాడుతూ రోడ్లమీద ప్రయాణిస్తున్నప్పుడు గోతులు ఉండడం సహజం కానీ మన రాష్ట్రంలో గోతులు మధ్య ఉన్న రోడ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్ర మత్తులో ఉన్న సీఎం ఇప్పటికైనా నిద్ర మేల్కొని రాష్ట్రంలో ఉన్న రోడ్లను మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పెంచలరావు, జనసైనికులు, పెంచల ప్రసాద్ శ్రీహరి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.