అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చంద్రగిరి జనసేన శాంతియుత ర్యాలీ

చంద్రగిరి, చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర శాశ్వతంగా డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ… గురువారం చంద్రగిరి జనసేన ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.