చవలపాటి నాగేంద్రకు అండగా దొడ్డగర్ల సువర్ణరాజు

గోపాలపురం, భీమోలు గ్రామ పంచాయతీ తొక్కిరెడ్డి గూడెంకి చెందిన చవలపాటి నాగేంద్ర అనే వికలాంగునికి గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి దొడ్డగర్ల సువర్ణరాజు వీల్ చైర్ మరియు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని అది తమ పార్టీ ఆశయాల్లో భాగమని ఈ సందర్బంగా సువర్ణరాజు తెలిపారు. వారి కుటుంబ పరిస్థితి చూసి ద్రవించి పోయిన ఆయన వారికి అన్నీ రకాలుగా సహాయం అందిస్తా అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల ఉపాధ్యక్షులు పోసిన గణపతి, సూర్యభగవాన్, ఉమ మహేశ్వరావు, కృష్ణ, దేవి వరప్రసాద్, ఫణింద్ర, బాలు, వేణు, రాజు, శ్రీను, రామారావు, వీరమళ్ళ శ్రీను, నరేంద్ర, నరేష్, ప్రగడ రాంబాబు, కృష్ణబాబు, కోడి రామకృష్ణ మరియు ఇతర గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.