చౌకబారు ఆలోచనలు నీచమైన రాతలు మానుకోవాలి: తాళ్లపాక శంకరయ్య

  • ఏ.బి.ఎన్ రాధాకృష్ణపై ధ్వజమెత్తిన తాళ్లపాక శంకరయ్య

రాజంపేట: ఏబీఎన్ రాధాకృష్ణ ఆర్కే విత్ వీకెండ్ అనే కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పై ప్రస్థాపన తెచ్చి నిధుల గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో చౌకబారు ఆలోచనలు, నీచమైన రాతలు మానుకోవాలని రాజంపేట జనసేన నేత తాళ్లపాక శంకరయ్య ధ్వజమెత్తారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు మంగళవారం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ అన్నారు. జనసేన పార్టీఅధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తుంటే, జనసేన పార్టీపై దుష్ప్రచారం చేసి ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్తలు వేయడం సమంజసం కాదన్నారు. కెసిఆర్ లక్ష కోట్లు, చంద్రబాబు లక్ష కోట్లని ఒక్కొక్కరు ఓ విధంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదని మీరు ఎంత బలంగా చేసిన జనసేన పార్టీ పట్ల ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజంపేట జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా నీ వికృత చేష్టలు, నీచమైన రాతలు మానుకోకపోతే భవిష్యత్తులో నీవు నీరాజకీయ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తాళ్లపాక శంకరయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, వెంకటయ్య, కొండపల్లి హరి, బాల సాయి, వీరయ్య ఆచారి, మల్లెం నరసింహులు తదితరులు పాలొన్నారు.