జనసేనలో చేరిన సీనియర్ వైసీపీ నాయకుడు చెల్లారెడ్డి

తాడేపల్లిగూడెం సీనియర్ వైసీపీ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు. మంగళవారం ఆయన స్వగృహం నుంచి వీకర్స్ కాలనీ ఘంటసాల బొమ్మ వరకు ర్యాలీగా వచ్చి ప్రజలందరూ బొలిశెట్టి శ్రీనివాస్ కు మద్దతు పలకాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసిన వారంతా ఇక్కడి అవినీతి పాలనకు, స్థానిక నాయకుని మామూళ్ల వసూళ్లకు బాధితులయ్యారని అందుకే అందరూ ఏకతాటిపై జనసేన పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఐదు వార్డులను ప్రభావితం చేయగల నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి అని తాను ప్రత్యక్ష రాజకీయాల్లో వార్డులలో తమ అభ్యర్థులను గెలిపించుకుంటూ వార్డుల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తారన్నారు. ముక్కు సూటిగా మాట్లాడిన అవినీతికి ఆమడ దూరంగా ఉండే చెల్లారెడ్డి జనసేన పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. సీనియర్ నాయకులు తోట గోపి మాట్లాడుతూ చల్లారెడ్డి లాంటి నాయకులు వైసీపీలో వీడి స్వాగతించవలసిన విషయం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కొట్టు సత్యనారాయణకు మాటకటువు అంటూ వ్యాఖ్యానించడం ఇక్కడి నేత క్రింది స్థాయి నాయకులను మాట్లాడే తీరు అర్థం అవుతుంది అన్నారు.. తాడేపల్లిగూడెం నియోజకవర్గం చరిత్రలో ఈలి ఆంజనేయులు గారి మెజారిటీ కంటే బొలిశెట్టి శ్రీనివాస్ మెజారిటీ అధికంగా రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేడపాటి చెల్లారెడ్డి, పైబోయిన రఘు, వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, పసలు అచ్చుతం, మైలవరపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.