పాయకరావుపేట జనసేన ఆద్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు

పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా తిమ్మాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు అయినా సేనాపతి బాబురావు మాస్టర్ మరియు మత్తి కార్తీక్ ఆర్థిక సాయంతో గోకులపాడు గ్రామంలో గోకులపాడు జనసైనికులు ఆధ్వర్యంలో ఈరోజు అంగనవాడి పిల్లలకి కంచాలు, గ్లాసులు, టేబుల్ బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోకులపాడు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.