ఉత్తమ రైతు అవార్డు అందుకున్న చిన్నికృష్ణుడు

బుధవారం హైదరాబాద్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నిజామాబాద్‌ జిల్లా నుంచి ఎంపిక చేసిన ఉత్తమ రైతు చిన్నికృష్ణుడు అవార్డును అందుకున్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్‌ గ్రామానికి చెందిన చిన్నికృష్ణుడు నగర శివారులోని గూపన్‌పల్లిలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తూ దేశీయ వరి వంగడాలను కాపాడడంతో పాటు ఇతర రైతులకు అందజేసి ఆదర్శంగా నిలిచినందుకు కలెక్టర్‌ నారాయణరెడ్డి ఉత్తమ రైతుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో రైతు నేస్తం వ్యవస్థాపకులు వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.