చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరి ఎస్టేట్ నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యన్ సిద్దాంతాలు, కార్యాచరణ నచ్చి 70 మంది యువత పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ మీలాంటి యువత ముందుకు రావడం జనసేనలో చేరడం సంతోషంగా ఉంది. 2023లో ముందస్తు ఎన్నికలు వచ్చిన, 2024లో ఎన్నికలు వచ్చిన జనసేన పార్టీ సిద్దంగా ఉందని, పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమని నేటి చేరికలే సాక్ష్యం. మనమందరం రానున్న ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం కృషిచేద్దాం, పవన్ కళ్యాణ్ వచ్చే దసరా నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని, దానికి ముందే ప్రజావాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారని తెలియజేశారు.