టిడిపి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన చిరంజీవి యాదవ్

సత్యవేడు నియోజకవర్గం: వరదయ్యపాలెం మండలంలో తెలుగుదేశం నాయకులు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి హెలెన్ ను కలసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సరికాదని, ప్రశ్నిస్తే అణచివేయాలని చూస్తే ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలనే యుద్దాన్ని ఎదుర్కోడానికి జనసైనికులు సిద్ధం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శేఖర్, తులసీరామ్, వీరమహిళ శిరీష తదితరులు పాల్గొన్నారు.