బలుసుతిప్ప గ్రామాన్ని సందర్శించిన పితాని

గురువారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప గ్రామం సందర్శించి జనసేన పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను కలుసుకోని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఇటీవల చనిపోయిన జనసేనపార్టీ కార్యకర్త సంగాని అర్జున్ (చినబాబు) కుటుంబసభ్యులను పరామర్శించి.. అర్జున్ చిత్రపటానికి నివాళి అర్పించారు.. వారి వెంట జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, జనసేనపార్టీ సీనియర్ నాయకులు గుద్దటి జమ్మిగారు, గోదాసి పుండరీస్, మండలకన్వీనర్ మోకా బాలప్రసాద్, గిడ్డి ఏడుకొండలు(ఏ.సి.ఎఫ్), పిల్లి గోపి, సంగాని రామకృష్ణ, గిడ్డి రత్నశ్రీ, పెమ్మడి గంగద్రి, సంగాని ధనలక్మి, ఓలేటి శ్రీను, కాలడి రాజు, తదితరులు పాల్గొన్నారు.