జనసేన, టీడీపీ కార్యకర్తలతో చిర్రి బాలరాజు ఇష్టాగోష్టి

పోలవరం నియోజకవర్గం: టి.నరసాపురం మండలం, తెడ్లం గ్రామంలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులను, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను మర్యాదపూర్వం కలిసి ఇష్టగోష్టిగా చర్చించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, టికెట్ ఎవరికి వచ్చినా ఒకరికొకరు కలిసి పని చేసుకోవాలని, వైసీపీ నాయకులు ఓటమి భయంతో పుకార్లు సృష్టిస్తున్నారని ఏవి పట్టించుకోకుండా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దిరిశాల బ్రహ్మం, సంజయ్, దామోదర్ చౌదరి, బండి శ్రీనివాసరావు, గండ్ర కృపాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.