సివిల్స్ ర్యాంకర్ లక్ష్మి రమణి ని సత్కరించిన జనసేన నేత డి.ఎమ్. ఆర్ శేఖర్

రాజోలు నియోజక వర్గం, ఈదరాడ గ్రామానికి చెందిన యరంశెట్టి శ్రీ లక్ష్మి రమణి సివిల్స్ లో583వ ర్యాంక్ సాధించింది. ర్యాంకర్ రమణి స్వగ్రామం ఈదరాడకు విచ్చేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ డి.ఎమ్. ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఆమెను స్వగృహంలో కలిశారు. పుష్ప గుచ్చముఇచ్చి, శాలువా కప్పి సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంచి పల్లి అబ్బులు, లింగోలు పండు, నల్లా వెంకటేశ్వరావు, కొప్పుల నాగ మానస, యెరుబండి చిన్ని (ఈదరాడ) తదితరులు పాల్గొన్నారు.