కేంద్రం సరఫరా చేసే బియ్యాన్ని తను ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న సి.ఎం జగన్ రెడ్డి

వీర మహిళ భారతి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పేదలకోసం సరఫరా చేయమని ఇచ్చే బియ్యాన్ని నేటి సి.ఎం జగన్మోహన రెడ్డి తను ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనుసరించి సుమారు 55 లక్షల మందికి కేంద్రం సరఫరా చేస్తోండగా, మరో సుమారు 22 లక్షల మందిని ఈ యాక్ట్ పరిధిలో జగన్ ప్రభుత్వం చేర్చకుండా వారికి బియ్యాన్ని ఇవ్వకుండా చేయడం దారుణం, అంటే ఈ 22 లక్షల మంది ఓట్లు వేయలేదా లేక అక్కర్లేదా ఈ ప్రభుత్వానికీ.. ఈ జగన్మోహన్ రెడ్డికి ..? అంటూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతి మడిపడ్డారు. ఈ కార్యక్రమంలో శిరీష, మరియా, సుజాత, మాలతీ, హైమావతి పాల్గొన్నారు.