వై.ఎన్ కళాశాల విద్యార్థులను అభినందించిన చేగొండి హరిరామ జోగయ్య

ఆచంట, ఈ నెల 28, 29, 30 తేదీలలో న్యూడిల్లీలో జరుగు జాతీయ స్థాయి సాంభో బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైన వై.ఎన్ కళాశాల విద్యార్థులను మాజీ హోమ్ మినిస్టర్ చేగొండి హరిరామ జోగయ్య అభినందించారు. విద్యార్థులకు మంచి కోచింగ్ ఇస్తూ జాతీయ స్థాయిలో ప్రతిభవంతులుగా తీర్చిదిద్దుతున్న చీఫ్ కోచ్ పాండ్రంగి రుక్మాకరరావుని శాలువాతో సత్కరించారు. విద్యార్థులు మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎన్నో పతకాలను గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్, జనసేన జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ మరియు విద్యార్డులు పాల్గొన్నారు.