ఆంధ్రప్రదేశ్‌ అవతరణ: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు.