రేపు సీఎం కేసీఆర్ ప్రచార సభ

గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్నె ప్రభాకర్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల్లోగా కార్యకర్తలు స్టేడియానికి చేరుకోవాలని వెల్లడించారు. సమావేశంలో శానిటైజ్ చేసి, మాస్కులు ఇచ్చి లోనికి పంపిస్తామని కోవిడ్ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రచారానికి మూడు స్టేజీలు ఏర్పాటు, ఎల్బీ స్టేడియం బయట 12 స్క్రీన్ లు, సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. చిల్లర ప్రచారం చేస్తున్న వారికి కేసీఆర్ సమాధానం చెబుతారని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.