రాష్ట్రంలో శాంతిభ్రదతలపై సీఎం కేసీఆర్‌ సమావేశం

నేడు ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని శాంతిభద్రతలు, సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. హోంశాఖ, అటవీ శాఖ మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కార్యదర్శులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరుకానున్నారు.