భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ వరించింది. విశ్వంలోని అత్యంత అరుదైన అంశమైన కృష్ణబిలంపై పరిశోధనలకు శాస్త్రవేత్తలు రోజర్ పెన్రోస్, రిన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్లకు నోబెల్ పురస్కారం ప్రకటించారు. అవార్డును రెండు భాగాలు చేసిన రాయల్ స్వీడిష్ అకాడమీ.. ఒక భాగం అవార్డును రోజర్ పెన్రోజ్కు ఇవ్వనున్నది. మరో భాగాన్ని రీన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్లకు సంయుక్తంగా అందించనున్నారు. భౌతికశాస్త్రవేత్త రోజర్ ఫెన్రోజ్.. తన పరిశోధనలో సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కృష్ణబిలం ఏర్పడినట్లు నిర్ధారించారు. సువిశాల విశ్వంలోని పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్హోల్ గురించి ఆసక్తికర అంశాలు కనుగొన్నందుకు శాస్త్రవేత్తలు రీన్హార్డ్ గెంజెల్, ఆండియా గేజ్లను ఎంపిక చేశారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈసారి భౌతిక శాస్త్రంలో నోబెల్ను దక్కించుకున్నారు. విశ్వంలో అత్యంత అసాధారణమైన విషయాన్ని వాళ్లు గుర్తించినట్లు స్వీడెష్ అకాడమీ తన ప్రకటనలో పేర్కొన్నది.