రూ.50లక్షలు పరిహారం అందజేత

విజయవాడలోని ప్రైవేట్ కోవిడ్19 సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ మేరకు మృతుల కుటుంబసభ్యులకు ఏపీ మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌లు చెక్కులు మంగళవారం అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.