జనసైనికులకు పరామర్శ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-19-at-5.18.10-PM.jpeg)
తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు గ్రామంలో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న జనసైనికులను అమలాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పరామర్శించారు. చిందాడగరువు జనసైనికులు పొణకాల తాతాజీ, దాసరి నాగయ్య లను బుధవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిందాడ గరువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు, గ్రామకమిటీ అధ్యక్షులు పిల్లా రవి, ఏడిద పల్లంరాజు, మాజీ ఉప సర్పంచ్ కడలి సత్యనారాయణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.