Tirupati: జనసేన మద్దతు కోరిన రుయా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ MNO, FMO వైద్య సిబ్బంది

తిరుపతిలో జరుగుతున్న MNO,FMO వారి 7వ రోజు దీక్ష జనసేన మద్దతు కోరిన బాధితులు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరుపున పాల్గొన్న పసుపులేటి సురేష్ మాట్లాడుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ MNO,FMO వైద్య సిబ్బందిని (ఫ్రంట్ వారియర్స్) ను తొలగించడం అమానుషం అన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితులలో కాంట్రాక్టు సిబ్బంది కరోనా బాధితులకు చేసిన సేవలు చిరస్మరణీయం.. జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు రుయా ఉన్నతాధికారులు సహృదయంతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోని బాధితులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నాము. బాధిత MNO,FMO లకు న్యాయం జరగకుంటే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తూ ఏ పోరాటానికైనా సిద్ధమని జనసేన నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హేమ కుమార్, బాబ్జి, అమృత, పసుపులేటి సురేష్, సుమన్, మునిస్వామి, బాలు, కిరణ్, సాయి దేవ్, సురేంద్ర రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.