Razole: 7వ రోజు సభ్యత్వ నమోదు కిట్లను అందజేసిన రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం చింతలపల్లి మెయిన్ లో రాజోలు మండలం పరిషత్ ఉపాధ్యక్షుడు ( వైస్ ఎంపీపీ) ఇంటి పల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు బోనం సాయి చేతుల మీదుగా క్రియాశీలక సభ్యులుగా చేరిన కార్యకర్తలకు 7వ రోజు సభ్యత్వ నమోదు కిట్లను పంపిణి చేశారు. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారి ఇంటికెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో, పిప్పళ లక్ష్మణరావు, గురుజు జగదీష్, అద్దేపల్లి గోపి, ఘనసాల రామాంజనేయులు, పలివెల రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.