ఢిల్లీ ఎయిమ్స్‌లో 35 మంది వైద్యులకు కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్‌లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం పలు టీవీల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు ఢిల్లీలోని మరో ప్రముఖ గంగా రామ్‌ ఆసుపత్రిలో గురువారం 37 మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులని, తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 32 మంది వైద్యులు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాయి. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గంగా రామ్‌ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ డీఎస్‌ రాణాతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించారు.