దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలతో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దాంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.