ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా వీడియోను పంచుకున్నారు.

”నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అప్‌డేట్‌ ఇవ్వకలేకపోయా క్షమించండి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంది. దాంతో వెంటిలేటర్‌ తొలగిస్తారని మేము భావించాం. అయితే, ఇంకా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో వెంటిలేటర్‌ తీయడం సాధ్యపడలేదు. తాజాగా చేసిన పరీక్షల్లో నాన్నకు కరోనా నెగెటివ్‌ వచ్చింది” అని ఎస్పీ చరణ్‌ అన్నారు.