ఈ ఒక్క‌ విషయంలో పాజిటివ్‌గా ఉండకూడదనుకున్నాను.. సాధ్యం కాలేదు: ఆశిష్

త‌న‌కు  క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని, ఆసుప‌త్రిలో చేరుతున్నాన‌ని తెలుపుతూ సినీన‌టుడు ఆశిష్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.  తెలుగులో పోకిరీ, చిరుత, అతిథి, అదుర్స్  వంటి సినిమాల్లో ఆయ‌న‌ నటించి మంచి పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

త‌న‌కు ఈ మ‌ధ్య‌ కాస్త జ్వరంగా అనిపించడంతో కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నానని ఆయ‌న తెలిపారు. దీంతో త‌న‌కు రిపోర్టులో పాజిటివ్  వ‌చ్చింద‌ని అన్నారు. అన్ని విష‌యాన్ని పాజిటివ్‌గా ఉండే తాను, క‌రోనా విషయంలో మాత్రం పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నానని, కానీ, సాధ్యం కాలేదని తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆసుప‌త్రిలో చేరుతున్నాన‌ని, ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు‌ చేయించుకోవాలని కోరుతున్నానని చెప్పారు.