కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 వత్తుల దీపం వెలిగించిన నిఖిల్

కార్తీక పౌర్ణమి సందర్బంగా యంగ్ హీరో నిఖిల్ సికింద్రాబాద్ స్కందగిరిలోని కార్తికేయ స్వామి వారి దేవాలయ సన్నిధిలో 365 వత్తుల దీపం వెలిగించాడు. కుటుంబ సభ్యులతో దేవాలయంకు వెళ్లిన నిఖిల్ అందరితో పాటు దేవాలయంలో దీపాలను వెలిగించారు. ప్రతి ఏడాది కూడా తాను ఇలా దీపాలను వెలిగిస్తానంటూ చెప్పుకొచ్చాడు. కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామికి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని నిఖిల్ పేర్కొన్నాడు. భారీగా జనాలు ఉన్నా కూడా నిఖిల్ వెళ్లి దీపాలను వెలిగించి వచ్చాడు.