మంత్రి సత్యవతి రాథోడ్కి కరోనా పాజిటివ్
హైదరాబాద్ : తెలంగాణ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారినపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఆమెను ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.