ఎంపి రేవంత్‌రెడ్డికి కరోనా

హైదరాబాద్‌: తెలంగాణా కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.