పుదుచ్చేరి సిఏం రంగస్వామికి కరోనా.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.. ప్రస్తుతం రంగస్వామి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మే 7వ తేదీన ముఖ్యమంత్రిగా రంగస్వామి బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.