అవినీతి మంత్రి అంబటి రాజీనామా చేయాలి: దారం అనిత
అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా సత్తెనపల్లి నియోజకవర్గాన్నీ మార్చి, ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి తరహాలోనే అంబటి దోచుకుంటున్నాడని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తురు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత విమర్శించారు. మంగమ్మ దంపతులను ఆదుకోవాల్సిన మంత్రి తన అనుచరులను అడ్డుపెట్టుకొని బాధితుల సొమ్మును కూడా తీసుకుంటున్నారని ఇది సత్తెనపల్లి ప్రజల దౌర్బగ్యమని అన్నారు. కౌలురైతుభరోసా సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజనామా చేస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికాడని ఇప్పుడు స్వయంగా బాధితిలే ముందుకు వచ్చి చెప్తున్నారన్నారని తక్షణమే అంబటి రాంబాబు మంత్రి పదవికి రాజీనామా చేయాలని అనిత డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-3.00.32-PM-1024x768.jpeg)