మన ఊరూ మన ఆటలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్

పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు 61వ వార్డులో మన ఊరూ మన ఆట కార్యక్రమంలో భాగంగా ఆదివారం 61వ వార్డు గాంధీజీ వీధి గ్రౌండ్ (మల్కాపురం)లో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి, 61వ వార్డు అధ్యక్షులు దుంగ దేవన్ రాజుచే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించటం జరిగింది. 61వ వార్డు జనసేన పార్టీ సినియర్ నాయకురాలు నోట్ల రామ చంద్రకళ, జనసేన పార్టీ నాయకులు దుంగ మోహన్ రావు, తులసి రామ్, మోహన్, శంకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.