ఢిల్లీలో నేడు, రేపు రాత్రి కర్ఫ్యూ అమలు
ఢిల్లీలో గురు, శుక్రవారాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోకుండా నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో 20 బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు బయటపడడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరిన నేపథ్యంలో ఢిల్లీ.. రెండు రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. డిసెంబరు 31 నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు, మళ్ళీ జనవరి 1 రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ ప్రకటించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గానీ, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కలుసుకోవడాలను గానీ అనుమతించే ప్రసక్తి లేదని ఈ కమిటీ స్పష్టం చేసింది. కానీ ట్రాఫిక్ పై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవు.