క్రీడాకారుల సౌకర్యార్దం సి.డబ్ల్యూ.సి గ్రౌండ్ ను శుభ్రం చేయించిన దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజవర్గం: 64వ వార్డు, గంగవరం కొండవీధికి చెందిన అంజనీపుత్ర యూత్ ప్రాక్టీస్ టైంలో సి.డబ్ల్యూ.సి గ్రౌండ్లో కంచె తుప్పులు, చెత్త దుబ్బలు బాగా పెరిగిపోయి క్రీడాకారులకు ఇబ్బందిగా ఉంటుందని 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి ఫిర్యాదును తెలియజేశారు.. ఆయన వెంటనే స్పందిస్తూ జెసిబిని రప్పించి ఆ స్థలానికి చేరుకొని గ్రౌండ్ మొత్తం క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభ్రపరచడం జరిగింది. అంజనీపుత్ర యూత్ సభ్యులు మరియు క్రీడాకారులు దల్లిగోవింద రెడ్డికి అభినందనలు తెలియజేశారు. అలాగే గంగవరం మరియు పెదగంట్యాడ వెళ్లే రహదారిని రాకపోకలకు అనుగుణంగా రోడ్డు మొత్తం క్లియర్ చేయించారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికారి ప్రతినిధి చోడి పిల్లి ముసలయ్య చేశారు. ఈ కార్యక్రమంలో మెగా నూకరాజు, నూకాలు, పెంటయ్య, అమ్మోరు, పెంటారావు ధనరాజు, రాంప్రసాద్, నూకరాజు, దాసు తదితరులు పాల్గొన్నారు.