జనసేన పార్టీలో చేరిన దార్లవాలస గ్రామం

  • గిరిజన ప్రాంతాల్లో రోజురోజుకీ పెరుగుతున్న జనసేన పార్టీ ఆదరణ

రంపచోడవరం నియోజవర్గం: సోమవారం జనసేన పార్టీ నాయకుడు కుర్ల రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వేములుకొండ పంచాయితీ, దార్లవాలస గ్రామం మొత్తం జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. గిరిజన ప్రాంతాల్లో రోజురోజుకీ పెరుగుతున్న జనసేన పార్టీ ఆదరణ రంపచోడవరం నియోజవర్గంలో ప్రతి మండలంలోని జనసేన పార్టీ మండల అధ్యక్షులు జనసైనికులు పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వైసిపి పార్టీ ఎలక్షన్ ముందు అనంత బాబు ఈ గ్రామానికి రోడ్లు వేయిస్తాం మంచినీటి సదుపాయం ఇప్పిస్తాం స్కూలు ఏర్పాటు చేస్తాం ఎన్నో హామీలు ఇచ్చారు గాని ఇప్పుడు వరకు ఎటువంటి హామీ నెరవేరలేదు ఇవన్నీ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మాటల చెప్పడం కాదు పని చేసి చూపిస్తాం రాజశేఖర్ రెడ్డి గారి దార్లవాలస గ్రామానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజవర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, కొనతం శ్రీనివాస్, పంచాయతీ నాయకులు చింతల వాడ శీను, కుర్ల రవణ రెడ్డి, వన్జుం సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.