అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధికసాయం చేసిన దాసుళ్ళపాలెం జనసేన

ఎస్ కోట నియోజకవర్గం, ఎల్ కోట మండలం, దాసుళ్ళపాలెం గ్రామంలో ఇళ్ళు అగ్నిప్రమాదం సంభవించి మట్టా సింహాచలం ఇళ్ళు పూర్తిగా కాలిపొయింది. బాధిత సింహాచలానికి మేమున్నామంటూ దాసుళ్ళపాలెం జనసైనికులు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా సింహాచలం కుటుంబానికి 6000 రూపాయలను ఆర్ధిక సాయం చేయాడంతో పాటు బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందచేసారు. దాసుళ్ళపాలెం జనసైనికులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ భావజాలంతో ముందుకు నడుస్తున్నారని చెప్పాలి ఎందుకంటె దాసుళ్ళపాలెంలో జనసేనకి సంబందించి ఇదే మొట్ట మొదటి కార్యక్రమం. అధికార పార్టీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారని తెలిసినా శ్రీ పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా సభల్లో చెప్పినట్లు భయపడితే అక్కడె ఉండిపొతావు, నీకోసం ఎవరో రారు నువ్వే పోరాడాలి అన్న భావజాలానికి ఆకర్షితులై దాసుళ్ళపాలెం జనసైనికులు బయటికి వచ్చి చేసిన కార్యక్రమం ఇది. అగ్ని ప్రమాద బాధితునికి అండగా నిలిచిన దాసుళ్ళపాలెం జనసైనికులకు శతఘ్నిన్యూస్ అభినందనలు తెలియజేస్తుంది.