కాట్రావులపల్లిలో 11వ రోజు జనంకోసం జనసేన

జగ్గంపేట నియోజకవర్గం, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనంకోసం జనసేన కార్యక్రమం చేపట్టినట్లు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. జగ్గంపేట మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించడం ద్వారా ఆయా గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 11వ రోజు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇవ్వటం జరిగింది. ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీకి తెలియపరిస్తే ప్రజలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సూర్య చంద్ర తెలిపారు.