జనసేన మహా సంకల్పయాత్ర 2వ రోజు

అమలాపురం: జనసేన మహా సంకల్పయాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో ఏ.వేమవరప్పాడు గ్రామంలో ఇంటింటికి కరపత్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు లింగోలు పండు పార్టీ సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, నల్లా శ్రీధర్, ఇసుకపట్ల రఘుబాబు, ఏ.వేమవరప్పాడు ఉప సర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్.డి.ఎస్ ప్రసాద్ మునిసిపల్ కౌన్సిలర్ పడాల నానాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టు పండు, కొప్పుల నాగ మానస, వార్డు సభ్యులు తిక్క సరస్వతి, కర్రి లక్ష్మి దుర్గ, వానపల్లి దేవి మరియు నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.