భైంసా నూతన ఏఎస్పి, పట్టణ సీఐలను సన్మానించిన జనసేన నాయకులు

నిర్మల్ జిల్లా, భైంసా పట్టణానికి నూతన ఏఎస్పీ గా విచ్చేసిన కాంతి లాల్ పాటిల్ ను జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు కమిటి సభ్యులు సాదరంగా ఆహ్వానించి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను భైంసా లో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా జనసైనికులు భైంసా పోలీసులకు అన్ని సామాజిక, ఉద్యమ కార్యక్రమాల్లో సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళతామని, వినమ్ర పూరితంగా నడుచుకుంటానని మాట్లాడటం జరిగింది. కొన్ని రోజులుగా భైంసా పట్టణంలో సి.ఐగా విధులు నిర్వహించి, ప్రజల మన్నలను పొంది బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ కు వీడుకోలు పలుకుతూ, భైంసా పట్టణం నూతన సిఐ శ్రీనుకు స్వాగతం పలుకుతూ.. ఆయనకు కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు రామోజీ వార్, గంగప్రసద్, శేకర్ యాదవ్, అకోజి పవన్ తదితరులు పాల్గొన్నారు.