జనంకోసం జనసేన 336వ రోజు

  • వనరక్షణలో భాగంగా 700 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనం కోసం జనసేన 336వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 90895 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల కార్యదర్శి అరిసెపు విజయ్ కాంత్, రంప యర్రంపాలెం గ్రామ మీడియా సెల్ అధ్యక్షులు దేవలంక బాబు, గ్రామ ప్రధాన కార్యదర్శి నరుకుల మణికంఠ స్వామి, కర్రీ సుబ్రహ్మణ్యం, పిల్లి మహేష్, గంజి లక్ష్మీనారాయణ, కసిరెడ్డి చంటిబాబు, యార్దల లక్ష్మీనారాయణ, పంతం సాయిరాం, గంగంపాలెం నుండి గట్టెం దొరబాబు, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రంప యర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఊడి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు, సిరంగి బూరయ్య కుటుంబ సభ్యులకు, గుల్లింకల నాని కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.