జనంకోసం జనసేన 346వ రోజు

  • వనరక్షణలో భాగంగా 500 మొక్కల పంపిణీ
  • 500 గాజు గ్లాసుల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 346వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ ద్వారా మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 మొక్కలు మరియు 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 99595 మొక్కలు మరియు 1000 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. అవకాశం ఉన్న జనసైనికులు అంతా రేపటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల రైతు కమిటీ ఉపాధ్యక్షులు రౌతు పైడియ్య, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, మల్లిశాల నుండి గ్రామ అధ్యక్షులు చలపరెడ్డి లోవరాజు, బూత్ కన్వీనర్ తోగర సతీష్, బూత్ కన్వీనర్ తొగర గాంధీ, చీకట్ల దుర్గాప్రసాద్, తొట్టిపూడి చంద్రశేఖర్, యర్రా రాజేష్, మడక శ్రీను, నక్కరాజు రమేష్, కర్ణం స్వామి, గీసాల రాజేష్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, ద్వారపురెడ్ది ఉమా మహేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లిశాల గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సేవా సురేష్ కుటుంబ సభ్యులకు, తొగర గాంధీ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.