ఉద్ధానం సమస్యపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం 5వ రోజు

  • ఉద్ధానం ప్రజల కొరకు మన వంతు సాయంగా పోరాటం చేద్దాం

ఇచ్చాపురం: ఉద్ధానంలో కిడ్నీ సమస్యపై ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు సోంపేట మండలంలో చేపట్టిన లక్ష సంతకాలు సేకరణ కార్యక్రమం ఐదవరోజు కొర్లాం, పాలవలస, కడతలి పాలెం, జీడిపుట్టుగ, శాసనం గ్రామాల్లో నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా సుమారుగా 2700 మందితో సంతకాలు చేయంచడం జరిగింది. ఈ విధంగా ఐదవరోజు సంతక సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ దాసరి రాజు మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, కంచిలి మండల అధ్యక్షుడు డొక్కరి ఈశ్వర్, జనసైనికులు ఇంటింటికీ తిరుగుతూ సంతకాలు సేకరించారు. తదుపరి సంతకాల సేకరణ సోమవారం యదావిధిగా జరుగుతుంది. సోమవారం కూడా జనసైనికులు హాజరు కావాలని దాసరి రాజు మనవి చేసారు. ఎన్నో సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న ప్రజల కొరకు మన వంతు సాయంగా ఈ పోరాటం చేద్దామని దాసరి రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.