ఒక్క అవకాశం మహా సంకల్ప యాత్ర 9వ రోజు

అమలాపురం, జనసేన పార్టీ “ఒక్క అవకాశం” మహా సంకల్ప యాత్ర 9వ రోజు అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామం మెట్లకాలనిలో ఒక్క అవకాశం మహా సంకల్ప యాత్రను ప్రారంభించారు. ప్రతీ ఇంటికి అధ్యక్షుల వారి సిద్ధాంతాలను మనోగతాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీఇంటికి వివరిస్తూ 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. డ్రైనేజీ లైను పూర్తి కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మీ గ్రామ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మీకు న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు లింగోలు పండు కంచిపల్లి అబ్బులు వాకపల్లి వెంకటేశ్వరావు ఆకుల సూర్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి కొప్పుల నాగ మానస, బట్టు పండు, వీర మహిళ తిక్క సరస్వతి, నల్లా వెంకటేశ్వరావు, నిమ్మకాయల రాజేష్, డి.ఎస్.ఎన్ కుమార్, గంధం శ్రీనివాస్, పాలురి నారాయణ స్వామి, యాళ్ళ సురేష్, నల్లా దుర్గారావు, రాజా, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.