రైతులు ఆర్థికవృద్ధి సాధించేందుకు పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి

పాడేరు: జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయితీ కర్నిక్ లంకా గ్రామంలో పాడేరు అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య సూచనల మేరకు జి.మాడుగుల జనసేనపార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యనిర్వాహక సభ్యులు తాంగుల రమేష్, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, మండల నాయకులు కొర్రా భానుప్రసాద్ రైతుల సమస్యలపై స్వయంగా రైతులు పంటనూర్పిడి చేసే కల్లాలకు చేరుకుని అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యలేనటువంటి సహాయం రైతులకు చేస్తున్నారని అధికారంలో లేకుండానే అన్ని చేస్తున్నారని ఒక్కసారి ప్రభుత్వం స్థాపించిన తర్వాత రైతు సోదరులకు ఖచ్చితంగా మేలు చేస్తాడని తెలిపారు. అలాగే పంటకు తగ్గ గిట్టుబాటు ధర మార్కెట్ సదుపాయాలు కల్పించి ఆదివాసీ రైతులు ఆర్థికవృద్ధి సాధించేందుకు తగిన ప్రణాళికలతో పాలన చేస్తారని జనసేనపార్టీ ని ఆదరించి పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ రైతు దినోత్సవం సందర్బంగా మీరు ఈ వాస్తవ రాజకీయ సమీక్షలు గుర్తిస్తారని జి మాడుగుల మండల నాయకులు రైతు సోదరులకు తెలియజేసారు.