సింగనమల జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

సింగనమల జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రైతు దినోత్సవంలో భాగంగా సింగనమల మండలం నాగులగుడ్డం, తాండ గ్రామాలలోని రైతులను జనసేన నాయకులు కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపి, రైతులకు జనసేన పార్టీ చేస్తున్న సహాయం గురించి వివరించి, జాతీయ రైతు దినోత్సవాన్ని వారి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి, సింగనమల మండల కన్వీనర్ తోట ఓబులేశ రైతులు హనుమంతు, వీరాంజి, నాయకులు బెందెల సాయి శంకర్, కిరణ్ కుమార్, అశోక్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.