DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం!
ఐఫీఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్లతో విజయం సాదించింది. పంజాబ్ కింగ్స్ టార్గెట్ను ఛేదించడానికి ఢిల్లీ ఓపెనర్స్ దాటిగానే ఇన్నింగ్స్ను ఆరంభించారు. పృథ్వీ షా ఫోర్లు,సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాటిగా ఆడే క్రమంలో అర్షదీప్ సింగ్ వేసిన ఆరో ఓవర్లో మూడో బంతికి పృథ్వీ షా(32) క్రిస్ గేల్కు చిక్కాడు. దీంతో పవర్ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ నష్టపోయి 62 పరుగులు చేసింది. 10 వ ఓవర్లో మూడో బంతికి ధావన్(58) సింగిల్ తీసి అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అప్పటికి ఢిల్లీ 99/1 పరుగులు సాధించింది.
తర్వాత మెరిడీత్ వేసిన ఓవర్లో స్మిత్(9)రిచర్డ్సన్కు చిక్కాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన పంత్తో కలిసి శిఖర్ దావన్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్ళాడు. 15 ఓవర్లకు దిల్లీ 3 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. ఆ ఓవర్లొనే మంచి ఊపు మీద ఉన్న శిఖర్ ధావన్(92) ఔటయ్యాడు. రిచర్డ్సన్ వేసిన యార్కర్కు క్లీన్ బౌల్డయ్యాడు.
దీంతో త్రుటిలో సెంచరీ మిస్ అయింది. తర్వాత పంత్( 15) స్టోయినిస్ (23) మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళారు. చివరిలో పంత్ ఔటైనా.. లలిత్.. స్టోయినిస్ ఢిల్లీని గెలిపించారు.