కోయ గోపాలకృష్ణ కుటుంబసభ్యులకు జనసైనికుల ప్రగాఢ సానుభూతి

పెరుమల్లపురం గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త కోయ గోపాలకృష్ణ నాటి ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేసి నేటి జనసేన పార్టీని పటిష్టపరిచేందుకు చివరి వరకు శ్రమించారు. ఇటీవల రోడ్డు ప్రమాదం వలన మృతి చెందారు. వారి కుటుంబసభ్యులకు అండగా జనసేన పార్టీ ఎల్లప్పుడూ వుంటుంది అని తొండంగి మండల అధ్యక్షులు నాయుడు వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి చొక్కా కాశీ, తుని ఐటి కన్వీనర్ మణిబాబు, తొండంగి మండల కమిటీ సభ్యులు మరియు స్థానిక జనసైనికులు నివాళులర్పించారు.