దేశ రక్షకుడు, భారత ఆర్మీ అధికారి “బిపిన్ రావత్ కి” “వరంగల్ జనసేన” ఘననివాళి

హన్మకొండలోని కలెక్టర్ ఆఫీసు దగ్గర అమరవీరుల స్థూపం వద్ద మన దేశానికి రక్షణగా నిలిచి, భారత ఆర్మీలో విశేష సేవలు అందించిన త్రివిధ ధళాదిపతి, పోరాట యోధుడు, శ్రీ “జనరల్ బిపిన్ రావత్” హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో వారి మృతి పట్ల చింతిస్తూ వరంగల్ జిల్లా జనసేన పార్టీ నాయకులు ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు శివకోటీ యాదవ్ మాట్లాడుతూ మన దేశానికి బిపిన్ రావత్ చేసిన సేవలు వెలకట్టలేనివి మరియు మన అందరికి స్ఫూర్తి దాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వరంగల్ జిల్లా నాయకులు గోళ్ల రాజేంద్ర ప్రసాద్, గాదె పృధ్వీ, పెండ్యాల అనిల్, యం అభిలాష్, వసుగుల నిఖిల్ చోప్రా, మేడిద ప్రశాంత్, రజాక్, పిడుగు భరత్, రంగు భరత్, అన్సార్ తదితరులు పాల్గొన్నారు.