తంబూరు గ్రామ వంతెన త్వరితగతిన నిర్మించాలని జనసేన డిమాండ్

సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో తుంబురు గ్రామానికి వెళ్లే వంతెనను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ సందర్శిచారు. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉండాలని ప్రతి రోజు 6 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారని, వంతెన దాటడానికి పిల్లలు,మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, గత సంవత్సరం ఇదే విధంగా వంతెన నీటి ప్రవాహానికి కూలిపోయింది. యుద్ధప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలు రాకపోకలు జరిగేలా చూడాలి. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ప్రజలకోసం జనసేన పార్టీ పోరాటాలు చేయడానికి సిద్ధమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్, రామ్మూర్తి, సుమన్, చరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.