గెలిచిన ఢిల్లీ.. ప్లేఆఫ్‌కు చేరిన ఆర్సీబీ

అబుదాబి వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగగా.. బెంగళూరుపై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక ఇవాళ ముంబై-హైదరాబాద్‌ మధ్య జరిగే మ్యాచ్‌ తర్వాత… ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ ఎవరిదో తేలుతుంది. బెంగళూరుపై గెలిచి రెండో స్థానాన్ని ఢిల్లీ సాధించింది. ఇక ఢిల్లీ చేతిలో ఓడినా…మెరుగైన రన్‌రేట్‌తో బెంగళూరు టీమ్‌ కూడా ప్లే ఆఫ్‌కు చేరింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. అజింక్య రహానె (60; 46 బంతుల్లో, 5×4, 1×6), శిఖర్‌ ధావన్‌ (54; 41 బంతుల్లో, 6×4) అర్ధశతకాలతో అదరగొట్టారు. దీంతో ఢిల్లీ ప్లేఆఫ్‌కు చేరింది. అయితే ఓడినా మెరుగైన రన్‌రేటు ఉండటంతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు చేరింది.